G-N7RFQXDVV7 సైనైడ్ కోసం మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ 

Ticker

6/recent/ticker-posts

సైనైడ్ కోసం మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ 


 


సైనైడ్ కోసం మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ 


జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం సైనైడ్.  ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై లిమిటెడ్ తో కలిసి నిర్మించడానికి  అమెరికా లో ప్రముఖ డిస్టిబ్యూషన్  అండ్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ముందుకొచ్చింది.


ఈ సందర్భంగా ప్రైమ్ షొో ఎంటర్ టైన్మెంట్ అధినేత కే నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ‘ప్రవాసాంధ్రులమైన మేము సినిమాల మీదున్న ఆసక్తితో తెలుగు సినిమాలకు ప్రాధాన్యతినిస్తూ, దేశ వ్యాప్తంగా చక్కటి సినిమాలను నిర్మించాలనే ఉద్ధేశ్యంతో ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ సంస్థను స్థాపించాం. ప్రియమణితో రాజేష్ టచ్ రివర్ రూపొందిస్తున్న సైనైడ్ చిత్రం కథ మమ్మల్ని బాగా ఇన్ఫైర్ చేసింది. మేము వెదుకుతున్న ప్యాట్రన్ లో కథ వుండటంతో  మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై. లిమిటెడ్ తో కలిసి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాం. సాధారణంగా సైనైడ్ మోహన్ కేసును అందరూ పేపర్ లో చదివే వుంటారు. కానీ రాజేష్ టచ్ రివర్ తీసుకున్న పాయింట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే ఈ సినిమాపై ఆసక్తి కలిగింది. ఒక కథను ఇలా సరికొత్త స్క్రీన్ ప్లేలో చెప్పడంతో తెలుగులో ఇదే తొలిసారి కావచ్చు‘ అని అన్నారు. 


మిడిల్ ఈస్ట్ సినిమా పై.లి. అధినేత ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ ‘ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ సంస్థ మాతో కలిసి పనిచేయడానికి స్వాగతిస్తున్నాం. దేశంలోనే అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించిన సైనైడ్ మోహన్ కేసుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో మలయాళంలో 300 చిత్రాలకు పైగా నటించి, రాస్త్ర అవార్డ్స్  మరియు  ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకొని   తెలుగులో ‘నా బంగారు తల్లి’ చిత్రం ద్వారా నంది అవార్డు అందుకున్న సిద్ధిఖ్ ఇందులో ప్రముఖ పాత్ర పోషించడానికి ఈ చిత్రంతో జత కలిశారు. అలాగే కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండు సార్లు కర్ణాటక  రాష్ట్ర అవార్డులను, బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్టుగా పలు మార్లు ఫిలిమ్ ఫేర్ అవార్డులుఅందుకున్న రంగాయన రఘు, తమిళ్ , మలయాళ నటుడు, కేరళ రాష్ట్ర అవార్డు గ్రహీత మణికంఠన్  ఆచారి , మలయాళం లో దాదాపు 150 సినిమాలలో నటించిన శ్రీజిత్ రవి  ,  ప్రశాంత్  అలెగ్జాండర్   కూడా ఈ సినిమాలో నటించనున్నారు. అంతేకాకుండా  మహర్షి, ఊపిరి, పంజా, గజని, ఫా, స్పెషల్ ఛబ్బీస్ తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే సినిమాలకు, ఉరిమి, మామాంగం,పడిసి రాజా  లాంటి హిస్టారికల్ చిత్రాలను యాడ్స్ ను కలుపుకొని దాదాపు వెయ్యి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించి, కేరళ రాష్ట్ర అవార్డు గ్రహీత సునీల్ బాబు ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో దాదాపు ఐదు సెట్లు నిర్మించాల్సి వుంది. సెట్స్ కున్న ప్రాముఖ్యతను ద్రుష్టిలో పెట్టుకొని సునీల్ బాబును ప్రొడక్షన్ డిజైనర్ గా ఎంపిక చేశాం’ అన్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ ‘సైనైడ్ మోహన్  సంచలనాత్మక కేసును ప్రేరణగా తీసుకొని సైనైడ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కథాంశానికొస్తే,. ఇరవై మంది అమ్మాయిలలో ప్రేమను ప్రేరేపించి, శారీరకంగా అనుభవించాక వారికి సైనైడ్ ఇచ్చి బంగారు ఆభరణాలతో ఉడాయించే సైనైడ్ మోహన్ కేసు ప్రేరణతో ఈ కథ రూపొందించబడింది’ అని అన్నారు.


పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రియమణి, లీడ్ కేరెక్టర్ లో నటిస్తుండగా, హిందీలో ఇదే పోలీస్ ఆఫీసర్ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు.  


జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. బెంగళూరు, మంగళూరు, మైసూర్, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ కీలకమైన షూటింగ్ ప్రదేశాలలో షూటింగ్ కొనసాగుతుంది .


ఇంకా ఈ చిత్రం లో చిత్రంజన్ గిరి, తణికెళ్లభరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు, ముకుందన్, రిజు బజాజ్,  తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు


అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జార్జ్ జోసెఫ్ సంగీతం, ఎంజీఆర్ శివాజీ అకాడమీ అవార్డు గ్రహీత  శశి కుమార్ ఎడిటింగ్. జాతీయ అవార్డు గ్రహీత అజిత్ అబ్రహం ,సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు .


 పలు జాతీయ, అంతర్జాతీయ  అవార్డులు అందుకొని, ఇటీవల ‘వి’ సినిమాకు మేకప్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రశంసలుపొందిన స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ మెన్ గా ఎన్.జి. రోషన్,  రాజేష్ టచ్ రివర్ పలు చిత్రాలకు మాటలు రాసిన రవి పున్నం మాటలు,  డాక్టర్ గోపాల్ శంకర్ పాటలు అందిస్తున్నారు. పి.ఆర్.ఓలు గా  నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కంటెంట్ సలహాదారు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ , నిర్మాతలు : ప్రదీప్ నారాయణన్, కే నిరంజన్ రెడ్డి,  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్,