బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దర్శనమిచ్చారు. తను తాజాగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడకు చేరుకున్నట్టు తెలిసింది. కాకినాడ, ఉప్పాడ బీచ్ పోర్టు , అమలాపురం సమీపంలోని ఓడలరేవు బీచ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని అందులో అమీర్ ఖాన్ పాల్గొంటాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నాగచైతన్య కూడా ఓ పాత్రలో నటిస్తుండటం విశేషం. అమీర్ ఖాన్ కాకినాడలోని ఓ హోటల్ లో విశ్రాంతి తీసుకున్నారు. బాలీవుడ్ హీరో కావడంతో హోటల్ సిబ్బంది సెక్యూరిటీ పెంచారు. అభిమానులు చాలా సేపు హోటల్ బయట వెయిట్ చేసి వెనుదిరిగి వెళ్లారు. ఆర్మీ జవాన్ జీవితంతో తెరకెక్కే ఈ చిత్రం ఫారెస్ట్ గంప్ కు ఆధారంగా రూపొందుతున్నట్టు తెలిసింది. ఇంకా కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా గెస్ట్ గా ఇందులో కనిపించనున్నారని చిత్ర వర్గాలు చెప్పాయి.అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు కార్గిల్, లడఖ్, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు.
Social Plugin