ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న పృధ్వీరాజ్ సుకుమారన్ బ్రో డాడీ చిత్రంలో నటించడానికి ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తన చిరకాల మిత్రుడు మోహన్ బాబును కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. ఇద్దరు మోహన్ లు డిన్నర్ కు కలిసిన సందర్భం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుటుంబ ఆల్బమ్ నుంచి తరచుగా అమూల్యమైన ఫోటోలను పోస్ట్ చేసే లక్ష్మీ మంచు ఆగస్టు 6న జరిగిన ఈ ఇన్సిడెంట్ ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసింది. అవి కాస్త అటు మలయాళంలో, ఇటు తెలుగు వెబ్ సైట్లలో వైరల్ అయ్యాయి.
Social Plugin