స్టీవెన్ స్పీల్ బర్గ్ ఒక అద్భుత స్రుష్టికర్త అని తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. ఆయన రూపొందించిన జురాసిక్ పార్క్ ఇండియాలో కూడా ఒక్క ఊపు ఊపేసింది. తర్వాత ఆయన రూపకల్పన లో వచ్చిన అవతార్ కూడా ప్రతి ఒక్కరి ముద్రించుకుపోయింది. ప్రస్తుతం ఆయన వివాదాల ఊబిలో చిక్కుకున్నారు. వివరాల్లోకెళితే స్పీల్ బర్గ్ సొంత నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఏకం కానున్నది అనే వార్త సినిమా ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇందులో వింతేముంది? బిజినెస్ అన్నాక ఏదైనా సాధ్యమే అనుకోవచ్చు. కానీ ఇక్కడే వుంది అసలు తిరకాసు. స్పీల్ బర్గ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే చిత్రాలు ఆస్కార్ కు పోటీపడకుండా వుండేందుకు గట్టిగానే ప్రయత్నించారు. 2021లో కూడా స్ట్రీమింగ్ సర్వీసులలో విడుదలయ్యే చిత్రాలు ఫెస్టివల్స్ లో పోటీపడుకుండా వుండేందుకు అర్హత, నియమాలలో మార్పులను ప్రతిపాదించారు అంటూ వార్తలు వచ్చాయి. దీనిని స్పీల్ బర్గ్ తీవ్రంగా ఖండించారు. అసలు విషయం తెలియజేస్తూ, తన నిర్మాణ సంస్థ అమ్లిన్ పార్ట్ నర్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థతో సంవత్సరానికి పలు సినిమాలు నిర్మించేలా ఒప్పందం కుదరుచ్చుంది. నేను నెట్ ఫ్లిక్స్ ఛీప్ కంటెంట్ ఆఫీసర్ సరండోస్ తో భాగస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు కొత్త కథలను తెలియజెప్పడానికి కొత్త మార్గాల్లో ప్రేక్షకులను చేరుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించాను అంటూ చెప్పారు. అంతేకాకుండా ప్రజలు తమ వినోదాన్ని తమకు అనుకూలంగా వుండే ఏ రూపంలోనైనా చూసుకోవచ్చు. పెద్ద స్క్రీన్, చిన్న స్క్రీన్ అనే తేడా నాాకు లేదు. నేను కథను నమ్ముకుంటాను. మంచి కథలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో వుండాలి. ప్రజులు సురక్షితంగా ఇతరుల సహవాసంలో కూర్చొని సినిమా చూసే అవకాశం వుండాలని నేను భావిస్తున్నాను. కలిసి ఏడవండి, కలిసి నవ్వండి, కలిసి భయపడండి అనేది నా సిద్ధాంతం. నేను సినిమా థియేటర్ల మనుగడ చూడాలనుకుంటున్నాను అంటూ చెప్పారు.
Social Plugin