తమిళ హీరో ధనుష్ పై మద్రాస్ హై కోర్టు కన్నెర్ర చేసింది. ధనుష్ తను దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ పై ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ధనుష్ దాఖలు చేసిన పిటీషన్ పై మద్రాస్ హై కోర్టు సీరియస్ అయ్యింది. అంతే కాకుండా 48 గంటల లోపు 30.39 లక్షలు చెల్లించాలని జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం తీర్పునిచ్చారు. ధనుష్ వంటి ప్రముఖల కంటే తక్కువ సంపాదిస్తున్న వారు పన్నులు చెల్లిస్తున్నారని, మరియు ఇలాంటి వాటి కోసం న్యాయస్థానం తలుపు తట్టవద్దని చెప్పారు. పాల విక్రేతలు, రోజూవారి వేతన కార్మికుడు ఎంతో కష్టపడి ప్రతి లీటర్ పెట్రోల్ కు పన్నులు చెల్లిస్తున్నారు. ఇంత సంపాదిస్తున్న మీకు పన్నులో మినహాయింపు ఎందుకివ్వాలి? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో హీరో విజయ్ తను దిగుమతి చేసుకున్న రాయిస్ ఘోస్ట్ కోసం ప్రవేశపన్ను విధించడాన్ని వ్యతిరేఖిస్తూ కోర్టును ఆశ్రయించాడు. అప్పుడు కూడా ఇదే జడ్జి వ్యతిరేఖించారు. ప్రముఖులుగా పేరున్న హీరోలు ఇలా చిన్న చిన్న వాటికి కోర్టు తలుపు తడితే పబ్లిక్ లో కూడా వాళ్ల ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. ఇక ముందైనా కోర్టు మెట్లు ఎక్కేటప్పుడు కాస్త ఆలోచించి ఎక్కితే మంచిది అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Social Plugin