రచయితగా యండమూరి వీరేంద్రనాథ్ పేరు వినని వారుండరు. ఆయన రాసిన నవలలు తెలుగులో దాదాపు 16 సినిమాలుగా రూపొందాయి. చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ, మంచుపల్లకి, అభిలాష సినిమాలకు మాటల రచయితగా పని చేశారు. మెగాస్టార్ నటించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ చిత్రానికి కథను అందించారు. ప్రియరాగాలు అనే చిత్రానికి కథను అందించారు. అంత పెద్ద నవలా రచయిత తెలుగులో ఇప్పటి వరకు రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అది ఒకటి మెగాస్టార్ హీరోగా నటించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ కాగా, రెండోది రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో ‘అగ్నిప్రవేశం’ కావడం విశేషం. తాగాజా బెనర్జీ హీరోగా "అతడు, ఆమె - ప్రియుడు" అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బెనర్జీ ఒక ఆస్ట్రోనమి ప్రొఫెసర్ గా నటిస్తున్నాడు. ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్య క్రమాలు ప్రారంభమయ్యయి.. ఈ సినిమా గురించి బెనర్జీ స్పందిస్తూ .. "...ఇన్నాళ్లు నటుడిగా పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది. భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది " అని, త్వరలో విడుదలవుతుందని చెప్పారు.ఈ చిత్రంలో బెనర్జీ, సునీల్, కౌశల్, సుపూర్ణ తదితరులు నటిస్తున్నారు. రచన, దర్శకత్వం : యండమూరి వీరేంద్రనాద్. అయితే అంత పాపులర్ రైటర్ బెనర్జీ హీరోగా ఎందుకు తెరకెక్కిస్తున్నారు? అనే విషయంపై చిత్ర యూనిట్ వర్గాలు స్పందిస్తూ, కథలోని పాత్రను బట్టే యండమూరి గారు బెనర్జీని సెలెక్ట్ చేశారు. ఆయనైతే ఈ పాత్రకు సరైన న్యాయం చేస్తారనే నమ్మకం ఆయనకు కలిగింది అంటూ చెబుతున్నట్టు సమాచారం.
Social Plugin